Breaking News

శాస్త్రీయ విద్యాసాధనకై విద్యార్థులు పోరాడాలి.

పి.డి.ఎస్.యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు

మన ప్రతి న్యూస్/ నర్సంపేట

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం( పి.డి.ఎస్.యు) ఉమ్మడి వరంగల్ జిల్లా 23వ మహాసభ సందర్భంగా నర్సంపేటలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది. అనంతరం బిగిపిడికి జెండాను జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్ జెండాను ఎగరవేయగా ప్రతినిధుల సభలో అమరవీరుల సంతాప తీర్మానాన్ని పి.డి.ఎస్.యు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ ప్రవేశపెట్టాడు.ఈ మహాసభకు ముఖ్యవక్త గా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమాల దిక్సూచి పి.డి.ఎస్.యూ విద్యార్థి సంఘం అని కొనియాడారు ప్రగతిశీల భావజాలం వ్యాప్తి జరగాలంటే పి.డి.ఎస్.యూ లాంటి విప్లవ విద్యార్థి సంఘం చురుకైన పాత్ర పోషించాలని తెలిపారు అనంతరం జిల్లా నూతన జాతీయ విద్యా విధానం 2020 రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని,పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని,ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించాలని, సంక్షేమ హాస్టళ్లకు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించి మౌలిక వసతులు మెరుగుపరచాలని, ప్రైవేటు యూనివర్సిటీలను రద్దు చేయాలని, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేయాలని, విద్యా రంగంలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని పలు తీర్మానాలను సభ ఆమోదించింది. ఉద్యమాన్ని సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ తీసుకొని విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బలమైన విద్యార్థి ఉద్యమం నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు మాజీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజు, పి డి ఎస్ యు జిల్లా నాయకులు పర్వాన్,ఎడవేల్లి అనిల్,సిద్దు,సుభాష్ చంద్రబోస్, రాకేష్,సాయి,వినయ్,నవీన్,పవన్, శ్రీధర్ అఖిల్, రాము విక్రమ్, వివిధ మండలాల విద్యార్థి ప్రతినిధులు హాజరయ్యారు.