Breaking News

వేసవి, చలి, వర్షాకాలాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించిన విజ్ డమ్ ప్రీ స్కూల్ విద్యార్థులు

విజ్ డమ్ ప్రీస్కూల్ లో సీసన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

చిన్నారులు వర్షాకాల విశిష్టతను, ఈ కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలను మనోహరంగా వినిపించారు. వర్షంలో తడిసిన యెడల వచ్చే వ్యాధుల గురించి చిన్నారులకు ఉపాధ్యాయులు వివరించారు. వేసవి కాల విశిష్టత గురించి మరి కొంతమంది విద్యార్థులు వివరించారు. ఎండలో తిరగడం వల్ల శరీరం డిహైడ్రేషన్ కు గురై మూర్చపోతారని చిన్నారులు వివరించారు. విద్యార్థులు అకారణంగా ఎండకు బయటికి వెళ్లడం వలన వడదెబ్బ తగులుతుందని ఉపాధ్యాయులు వివరించారు. కావున చిన్నారులు విధిగా మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని వారు వివరించారు.
చలికాల విశిష్టతను, చలికాలంలో ధరించే దుస్తుల గురించి చిన్నారులు వేషాధారణలో వివరించడం జరిగింది. చలికాలంలో బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా శరీరానికి వ్యాజీలెన్ లేదా కొబ్బరి నూనెను కాళ్ళకు, చేతులకు విధిగా రాయాలని తద్వారా శరీరం ప్రకాశవంతంగా ఉంటుందని ఉపాధ్యాయులు వివరించారు. ఈ మూడు కాలాల ప్రాముఖ్యతను, ఉండే విధానాన్ని, ధరించే దుస్తులను, తీసుకొనే జాగ్రత్తలను పాఠశాల కరస్పాండెంట్ జహంగీర్, డైరెక్టర్ జావేద్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీం సుల్తానా, అకాడమిక్ అడ్వైజర్ నాజియ ఇక్బాల్ లు వివరించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఇంచార్జి హారిక, ఉపాధ్యాయులు దివ్య, సరితారాణి, మాధవి, రాధిక, అఖిల, స్వాతి, సౌజన్య, రవళి, సుజాత, రజనీ కుమారి, కళ్యాణి, శ్రీలత, భద్రయ్య, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.