గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అభినందనలు
మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్:
వైరా మండలం పుణ్యపురం గ్రామపంచాయతీని ఏకగ్రీవ గ్రామంగా తీర్చి, సర్పంచ్గా యంగల మరియమ్మ ని ఎన్నుకున్న గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ పుణ్యపురం గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో పుణ్యపురం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు గుర్తుచేసి, ప్రజా పరిపాలనను అదే గ్రామం నుంచి ప్రారంభించిన రోజులను స్మరించుకున్నారు. గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించిన ప్రజా పాలనకు గుర్తింపుగా ఈ ఏకగ్రీవ నిర్ణయం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు నాగబోయిన కృష్ణ, మాజీ సర్పంచ్లు గద్దె మల్లికార్జున్, జోనెనోయిన వెంకటేశ్వర్లు, నాయకులు యంగల కృష్ణ, ఆవల నాగబాబు, వాకదాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.అదేవిధంగా వైరా నియోజకవర్గం నుంచి బొర్రా రాజశేఖర్ (మాజీ వైస్ చైర్మన్), టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు, మచ్చ వెంకటేశ్వరరావు (బుజ్జి), పమ్మి అశోక్, కట్ల సంతోష్, పణితి శ్రీను, శీలం చంద్రశేఖర్ రెడ్డి, తుమ్మపల్లి కృష్ణరావు, పుల్లం రాజు, కొండల రాజు, సైదులు రాజు, ఊరుకొండ నాగేశ్వరరావు, నారపోగు రవి, మెరుగు వెంకటి, గద్దె శ్రీనివాసరావు, కంభంపాటి అప్పారావు, నాగబోయిన నాగేశ్వరరావు, కంభంపాటి కరుణాకర్ రావు, బట్టు యాలాద్రి, మేగనం మహి తదితరులు హాజరయ్యారు.

