- సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతి
మన ప్రగతి న్యూస్ / కాప్రా ప్రతినిధి:
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి వినతి పత్రం ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు అందజేశారు. అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో ఈరోజు ఐ అండ్ పిఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబుతో పాటు జాయింట్ డైరెక్టర్ జగన్ లను కలిసి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఇప్పటికే ఇటీవల రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నగరం లోని ఐ అండ్ పిఆర్ అధికారులకు కూడా వినతి పత్రాలు అందజేశాం. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ సీనియర్ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అడ్ హాక్ కమిటీ కన్వీనర్ పిల్లి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య లతో పాటు రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, రాజశేఖర్, హాష్మీ తదితరులు పాల్గొన్నారు.

