మనప్రగతి న్యూస్ – విశాఖపట్నం
డిసెంబర్ నెలలో రెడ్ డిపోల్లో రాగుల పంపిణీ చేపట్టనున్నట్లు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ సమాచారం ఇచ్చారు. లబ్ధిదారులకు మూడు కిలోల రాగులు అందజేయనున్నట్టు తెలిపారు. రెడ్ డిపోలకు వెళ్లే లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

