న్యూరో ఫిజీషియన్ డాక్టర్ అమృత్ రెడ్డి
జనరల్ ఫిజీషియన్ డాక్టర్ లెక్కల విద్యసాగర్ రెడ్డి
మన ప్రగతి న్యూస్ /నర్సంపేట
గ్రీన్ స్టార్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మూర్చ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన అవగాహన కల్పించి మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా న్యూరో ఫిజీషియన్ డాక్టర్ అమృత్ రెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి లు మాట్లాడుతూ రోగికి మూర్చ వ్యాధి వచ్చినప్పుడు దగ్గరలో ఎలాంటి వస్తువులు ఉంచకూడదని చేతిలో ఇనప వస్తువులు పెట్టకూడదని అన్నారు. రోగికి మూర్చ వచ్చినప్పుడు మెదడు తన కంట్రోల్ లో ఉండదని అలాంటప్పుడు ఆ వస్తువులతో తనకు హాని జరగవచ్చు కావున ఏలాంటి వస్తువులు దగ్గర ఉంచకూడదన్నారు. మూర్చ వచ్చి తను స్పృహలోకి వచ్చాక వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. బిపి కోసం మందులు వాడుతున్న రోగి డాక్టర్ ను సంప్రదించకుండా బీపీ కంట్రోల్ లో ఉందని మాత్రలు వేసుకోవడం మానొద్దని అన్నారు. మూర్చ రోగి సమయానికి వైద్యం అందుకోలేకపోతే భవిష్యత్తులో జ్ఞాపకశక్తి మందగించడం నరాలు సచ్చుపడిపోవడం పక్షవాతం లాంటి జబ్బులకు గురవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సింధు హాస్పిటల్ డైరెక్టర్లు గోనే యువరాజు బిరం నాగిరెడ్డి అనంతగిరి రవి,చారి పి ఆర్ ఓ లు రవి రెడ్డి బాలకృష్ణ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

