Breaking News

స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి

శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్,సిపిఐఎం నాయకులు

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం స్థానిక నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషితో పనిచేసి అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సూచించారు. సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ఈరవెన్ను గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్,సిపిఐఎం పార్టీల నాయకులు శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా పార్టీ శ్రేణులు పార్టీ లో చేరిన నాయకులు చురుకుగా కృషి అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు.
ప్రజలకు సేవలందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి, సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధత తమను ఆకట్టుకుందని,అందుకే ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గం యూత్ ఉపాధ్యక్షుడు గోనె మహేందర్ రెడ్డి, గాదరి కుమారస్వామి, అనుముల రమేష్, తుడుసు మల్లేష్, లంక ఐలయ్య పన్నీరు రాజశేఖర్,దామెర పెద్ద మల్లయ్య, బీర్రు భాస్కర్, జక్కుల ముత్తయ్య, జక్కుల రాజు, పన్నీరు రాజు,పన్నీరు పవన్,తదితరులు పాల్గొన్నారు.