మన ప్రతి న్యూస్/ఏన్కూర్
భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేసి గీతా జయంతి సందర్భంగా నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీల్లో ఏన్కూర్ మండలం నాచారం గ్రామానికి చెందిన తోట రాధాకృష్ణ సతీమణి తోట గిరిజ గోల్డ్ మెడల్ సాధించారు. దత్త పీఠం స్వామీజీ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్న గిరిజ సాధనకు విశేష స్పందన లభిస్తోంది. ఆధ్యాత్మికతపై ఆసక్తితో నిరంతర సాధన ద్వారా విజయం సాధించిన ఆమెను పలువురు అభినందిస్తున్నారు.

