Breaking News

జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు

_ జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

మన ప్రగతి న్యూస్ / సిరిసిల్ల జిల్లా

వ్యవసాయ ఎగ్జిబిషన్‌కు ఏన్కూర్ మండలం నుంచి బయలుదేరిన రైతులు

శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నెల రోజుల డిసెంబర్ 1వ తేది నుండి 31 వరకు పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు,పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు,రాస్తా రోకోలు నిరసనలు,ర్యాలిలు,పబ్లిక్ మీటింగ్ లు,సభలు సమావేశాలు నిర్వహించదు అని తెలిపారు,నిబంధనలకు విరుద్డిదంగా డి.జే వినియోగించారాదని తెలిపారు. శాతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు, జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.జిల్లాలో శాంతి,వాతావరణం కొనసాగేందుకు ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.