మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా.. మొదటి రోజు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దారా రోహిణి యుగంధర్ నామినేషన్ దాఖలు చేశారు. రెండవ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పగడాల రమాదేవి రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. మేజర్ పంచాయ తీలో ప్రధానమైన ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఓటర్లు ఇరు పార్టీల అభ్యర్థులలో ఎవరు గెలుస్తారోనని ఈ సందర్భంగా చర్చించు కుంటున్నారు. ఇరు పార్టీలు అన్ని వార్డులలో గెలుపు గుర్రాల కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అభ్యర్థులను ఎంపికలో నిమగ్నమవుతున్నారు.


