Breaking News

సీతారామ ప్రాజెక్టు పనుల్లో ఘోర ప్రమాదం, డైలీ వేజ్ కార్మికుడు మృతి

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం పరిధిలోని నాగుపల్లి గ్రామం వద్ద సీతారామ ప్రాజెక్టు పనులు చేస్తుండగా హెవీ విద్యుత్తులైన్ కు మిషన్ తాగటంతో మిషన్ ఆపరేటర్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డైలీ కూలి కార్మికుడు రామ్ సింగ్ గోవింద్ (25) క్షణాల్లో మృత్యువాత పడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపారు. కార్మికుల సేఫ్టీ కోసం ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోని ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకొని, హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..