ముందస్తు అనుమతి లేని ర్యాలీలు, సభలకు పూర్తి నిషేధం
శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయం
ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యక్రమాలు పూర్తిగా నిషేధం
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు
ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని ఎస్పీ స్పష్టం
జిల్లా ఎస్పీ:సునిత రెడ్డి, ఐపీఎస్
మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:
వనపర్తి జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం, ప్రజా వాతావరణం ప్రశాంతంగా కొనసాగడం, అనవసర గుమికూడింపులు నివారించడం లక్ష్యంగా డిసెంబర్ 01 నుంచి డిసెంబర్ 31 వరకు 30 పోలీస్ యాక్ట్–1861 నిబంధనలు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎస్పీ మాట్లాడుతూ..వనపర్తి జిల్లా పరిధిలో ఎవరైనా పోలీసు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, భారీ స్థాయి సమావేశాలు నిర్వహించడం కఠినంగా నిషేధం. ప్రజా జీవనాన్ని అంతరాయం కలిగించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యకైనా చోటిలేదు” అని స్పష్టం చేశారు. అలాగే “30 పోలీస్ యాక్ట్” ఉల్లంఘనలకు చట్టంలో స్పష్టమైన శిక్షలు ఉన్నాయి. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపట్టిన వారిపై ఎటువంటి మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ప్రజల భద్రత కోసం పెట్టబడ్డాయి… అందరూ తప్పనిసరిగా పాటించాలి అని హెచ్చరించారు.ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఏ కార్యక్రమం కావాలన్నా ముందుగానే దరఖాస్తు చేసి అనుమతి పొందండి. ప్రజల సహకారం వల్లనే శాంతిభద్రతలు నిలుస్తాయి. పోలీసుల చర్యలు ప్రజల రక్షణ కోసమేనని ఎస్పీ తెలిపారు.

