మన ప్రగతి న్యూస్ /నల్గొండ/వేములపల్లి
వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామపంచాయతీ కార్యదర్శి కూర్చోవాల్సిన కుర్చీలో గ్రామ సిబ్బంది కూర్చోవడం జరిగింది. ఒక అధికారి కుర్చీలో సిబ్బంది కూర్చోవడం ఎక్కడ లేని విధంగా లక్ష్మీదేవి గూడెం గ్రామపంచాయతీ పరిధిలో జరిగింది. బయటి నుండి వచ్చిన వ్యక్తులకు అధికారి ఎవరో తెలవకపోయినా అతను కూర్చున్న కూర్చి ఆఫీసర్ హోదాను తెలియజేస్తుంది. ఇటువంటి సందర్భంలో ప్రజలు అధికారి ఎవరనే విషయంలో తిక్కమక్క పడాల్సి వస్తుంది. ఇతనిని కార్యదర్శి అనుకోవాలా? సిబ్బంది అనుకోవాలా? ఏమీ అర్థం కావడం లేదు. గ్రామపంచాయతీ సిబ్బంది ఇలా కుర్చీలో కూర్చోవడం రూల్స్ ప్రకారం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి సంఘటన జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

