Breaking News

మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు ఆధ్వర్యంలో శరత్ మాక్స్ కేర్ కంటి ఆసుపత్రి వైద్య శిబిరం

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

పట్టణంలోని రెండవ వార్డు కమలాపురంలో శరత్ మాక్స్ కేర్ కంటి ఆసుపత్రి వారి నుండి స్థానిక కౌన్సిలర్ జుర్రుర్రాజు ఆధ్వర్యంలో కంటి పరీక్షల క్యాంపు పెట్టడం జరిగింది. ఈ క్యాంపులో 100 మందికి పైగా పాల్గొన్నారు. వారికి ఉన్న సమస్యలు గుర్తించడం జరిగింది. పదిమందికి ఆపరేషన్ అవసర నిమిత్తం ఉచితంగా శరత్ మాక్స్ కేర్ హాస్పిటల్ వారు అన్ని ఖర్చులు వారే చూసుకొని ఆపరేషన్ చేయించి ఇంటికి పంపించాలని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమం రెండో వార్డు ప్రజలకు ఉపయోగపడాలని స్థానిక కౌన్సిలర్ జుర్రుర్రాజు యాదవ్ హాస్పిటల్ వారితో మాట్లాడి రెండో వార్డ్ ప్రజల కంటి సమస్యను నిర్మూలించాలని క్యాంప్ పెట్టించడం జరిగింది అని అన్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..