మనప్రగతి న్యుస్/జగదేవపూర్ ప్రతినిధి:
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో బెల్ట్ షాపులో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం.. పోలింగ్ అయ్యేంతవరకు మద్యం విక్రయించరాదని ఎక్సైజ్ శాఖ తెలిపినప్పటికీ వారి నిబంధనలను సైతం తుంగలో తొక్కి అర్ధ రాత్రి వరకు మద్యం అమ్మకాలు విరివిగా సాగుతున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

