బీఆర్ఎస్,సిపిఎం మద్దతుతో బరిలోకి
మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:
ఏన్కూర్ మండలం తిమ్మారావుపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఎం పార్టీల బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా గుగులోత్ సుమలత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కన్నబోయిన వెంకటేశ్వర్లు, బోగినబోయిన వెంకటేశ్వర్లు, వేల్పుల రాములు, ఇటికాల లెనిన్, చిరునగిరి రామమూర్తి, మధు, మేడం రాఘవులు, డిల్లి రాంబాబు, బొందు రవి, చల్లా కోటేశ్వరావు, విసనపల్లి మనోహర్, యువ నాయకుడు సాయి, వేల్పుల చందు తదితరులు పాల్గొని అభ్యర్థికి తమ మద్దతు తెలిపారు.అభ్యర్థి గుగులోత్ సుమలత మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి ధ్యేయంతో ముందుకు వచ్చానని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.


