మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:
ఏన్కూర్ మండలం భద్రతండ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి టిడిపి బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దారావత్ కృష్ణ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధిని తన ధ్యేయంగా చేసుకుని ముందుకు సాగుతానని, ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకుడు ఆర్.ఎం. రామయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాదావత్ బాలాజీ, మాజీ ఎంపీపీ ఆర్.ఎం. వరలక్ష్మి, మాజీ జెడ్పిటిసి బాదావత్ బుజ్జి బాలాజీతో పాటు మహేష్, మాలోత్ కిషన్, బానోతు జుంకీలాల్, మొగిలి నరసింహారావు, మొగిలి కిట్టయ్య, ఎస్.కె యూనిస్, భూక్య రామచంద్రు, వాంకుడోత్ లక్ష్మి, మాలోతు లక్ష్మి, మాలోతు బిక్ర, బాదావత్తు శాంతి, బాదావత్ బాలు, బాదావత్తు నాగేశ్వరరావు, ధరావత్ బాలు తదితరులు పాల్గొన్నారు.


