మనప్రగతిన్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగులాంబ గద్వాల జిల్లాలోని.
అలంపూర్.
నియోజకవర్గం ఇటిక్యాల మండలం చాగపురం గ్రామంలో పరశురాముడు అనే అతనితోపాటు 40 మంది కార్యకర్తలు ఈరోజు శాంతినగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
వారందరికీ అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఇటిక్యాల మండలాధ్యక్షులు రుకుమానందరెడ్డి మరియు ఇటిక్యాల కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులు చాందు, లింగన్న, అల్లా బాకస్, ఆంజనేయులు, గొల్ల రామకృష్ణ, గోవర్ధన్,తదితరులు ఉన్నారు.

