మన ప్రగతి న్యూస్/హనుమకొండ:
అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి విద్యా శాఖ అధికారి వెంకటరెడ్డి ని రూ. 60000 లంచం తీసుకుంటుండగా కలెక్టరేట్ లోని తన కార్యాలయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విద్యా శాఖకు సంబంధించి వ్యవహారంలో ఈ లంచం తీసుకున్నారని వెంకటరెడ్డి తో పాటు.. సంబంధించిన మరో ఉద్యోగిని కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్న ట్లు సమాచారం. డీఈవో గా.. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక స్కూల్ వ్యవహా రంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నట్లు తెలిసింది. కలెక్టరేట్ లో ఏసీబీ అధికారు లు పూర్తి విచారణ చేపట్టారు.

