మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ :
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఏన్కూర్ పోలీసు శాఖ శుక్రవారం ప్రత్యేక తనిఖీల సందర్భంగా పట్టుకుంది. టీఎల్ పేట గ్రామానికి చెందిన నాగాటి భరత్ (26), తండ్రి పేరు వెంకటేశ్వర్లు, ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు.ఎస్సై ఎన్.సంధ్య సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడిలో మొత్తం 103 మద్యం సీసాలు (18.54 లీటర్లు) విలువ రూ.20,394 ను సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఎక్సైజ్ చట్టం 34(ఎ) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఎన్నికల నేపథ్యంలో నియమావళి ఉల్లంఘన, అక్రమ రవాణా,విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్సై సంధ్య హెచ్చరించారు.

