మనప్రగతి న్యూస్/ వేములవాడ:
వేములవాడ గ్రామీణ మండలం మర్రిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న మారం లక్ష్మీ రాజేశం. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈరోజు ప్రచారంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు ఇంటింట ప్రచారం నిర్వహించారు గ్రామ ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఎన్నికల గుర్తు అయిన ‘బ్యాట్’ గుర్తుకు ఓటు వేయాలని కోరారు, . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తాను. మర్రిపల్లి అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయించి, అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేస్తాను, అని హామీ ఇచ్చారు.

