శని గరం గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరిక
మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి
స్థానిక ఎన్నికల్లో నల్లబెల్లి మండలం శని గరం గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కక్కెర్ల శోభన్, నీలం సుధాకర్, మాజీ ఉప సర్పంచ్ బస్వ రాజుల భాస్కర్, కక్కెర్ల గోపి గార్లకు కండువా కప్పి బిఆర్ఎస్ లోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి ,ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్ , మాజీ ఎంపీపీ కక్కేర్ల శ్రీనివాస్ గౌడ్ ,గ్రామ పార్టీ అధ్యక్షుడు, ఉట్కూరి అశోక్, దండు శ్రీనివాస్, పోలేపాక రాజ్ కుమార్, కక్కెర్ల బన్నీ మరియు మండల నాయకులు పాల్గొన్నారు.

