మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపిన గంగపుత్ర సంఘం అధ్యక్షులు గుంటి సంజీవ, మహిళా సంఘం అధ్యక్షురాలు గుంటి రమ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సంపేట లో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చేపలు పట్టే వృత్తి బెస్తవారిదేనానడం మన కులాన్ని అధికారికంగా ప్రకటించడం మన అందరికీ గర్వకారణం. ఎందుకంటే మన వృత్తిని మనకు కాకుండా చేస్తున్న ఇతర కులాల పోటీ నుంచి మన వృత్తిని గుర్తించడం మనకు సంతోషం.అనాదిగా చేపల వృత్తిపై ఆధారపడి బతుకుతున్న బెస్తలకు ఉపాధి అవకాశాలు లేక సరియైన చెరువులు లేక జీవన భృతి కష్టమవుతుంది. ఇప్పటికైనా మనమందరం కలిసి మన కులాన్ని మన వృత్తిని బ్రతికించుకోవాల్సిన అవసరం ఉంది. తాత ముత్తాతల నుండి నియోజకవర్గంలోని ప్రతి చెరువులో మనకు సభ్యత్వం ఉండేది. ఈరోజుల్లో ఏ చెరువులో సభ్యత్వం లేకుండా ఉన్నాము. ఇప్పటికైనా మన కుల సభ్యులకు చెరువులలో సభ్యత్వం చేపలు అమ్ముకోవడానికి మార్కెట్ సదుపాయం కల్పించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో ప్రచార కార్యదర్శి సుదర్శన్,దుర్గ స్వామి, కేదారి, శ్రీనివాస్,సాంబయ్య, శ్రీనివాస్ మహిళా సంఘం సభ్యులు రేఖ,రజిత, శైలజ,సుజాత, మాధవి, నాగమణి, స్వరూప, లలిత, భారతమ్మ, అనురాధ, విజయ తదితరులు పాల్గొన్నారు.

