నల్లగుట్ట తండా స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి బానోత్ సుశీల రమేష్ నాయక్
మన ప్రగతి న్యూస్/ నెల్లికుదురు :
గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని నల్లగుట్ట తండా స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి బానోత్ సుశీల రమేష్ నాయక్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదివారం గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తాను అహర్నిశలు కష్టపడతారని, గ్రామంలో మిగిలిపోయిన సిసి రోడ్లు డ్రైనేజీ పనులను, అర్హులైన వారికి పెన్షన్స్ ఇందిరమ్మ ఇళ్లను ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్రామంలోని సమస్యలను తీర్చేందుకు అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నానని లేడీస్ పర్స్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నరేష్, రవి, రమేష్, లీల, ఉష, సురేష్, హరిలాల్, వెంకన్న, పీన, భారతి, మంగ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

