Breaking News

అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు దాడులు

ఏన్కూర్ ఎస్ఐ సంధ్య

107 సీసాల మద్యం స్వాధీనం – ముగ్గురిపై కేసులు నమోదు

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ అక్రమంగా మద్యం విక్రయం చేస్తున్న వారి పై ఏన్కూర్ పోలీసులు ఆదివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ సంధ్య తెలిపారు.గార్ల ఓడ్డుకు చెందిన ఎస్‌.డి. పాషా, హిమాంనగర్‌కు చెందిన భూక్యా తులసి, తిమ్మరావుపేటకు చెందిన పొదిల సత్యం అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు గుర్తించి, వీరిపై ఎక్సైజ్‌ చట్టం సెక్షన్‌ 34(ఎ) కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.దాడిలో నిందితుల వద్ద నుంచి మొత్తం 107 మద్యం సీసాలు స్వాధీనం చేసినట్లు ఎస్ఐ సంధ్య వివరించారు.ఎన్నికల సమయంలో జరిగే అక్రమ కార్యకలాపాలను ఏ విధంగానూ ఉపేక్షించబోమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సంధ్య హెచ్చరించారు.