Breaking News

పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

-కేసీఆర్ పాలనలో గ్రామ పంచాయతీలు దేశానికే ఆదర్శం
-కాంగ్రెస్ పాలనలో గ్రామ అభివృద్ధి శూన్యం
-గ్రామ సర్పంచ్ అభ్యర్థి కుందేన కమలమ్మ

మన ప్రగతి న్యూస్ /సదాశివపేట:
సంగారెడ్డి జిల్లా సదాశివాపేట మండల పరిధిలోగల నందికంది గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే గ్రామ సర్పంచ్ గా కుందేన కమలమ్మను గెలిపించాల్సిందిగా తెలిపారు. ప్రచారాల నేపథ్యంలో పలు గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే సర్పంచ్ అభ్యర్థులకు వచ్చిన గుర్తులను గుర్తు చేస్తూ గెలిపించాలని కోరారు.అన్ని వర్గాల ప్రజలకు మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ కు పంచాయతీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎన్ జి ఓ ఎస్ మాజీ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్, చింత సాయినాథ్, కుందెన రాజు, కొండాపూర్ మండల పార్టీ అధ్యక్షులు విటల్, రుక్ముదిన్ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..