కిరణ్ కుమార్ విజయం ద్వారానే గ్రామానికి నూతన దిశ—ప్రజల నమ్మకమే మార్పుకు పునాది
మన ప్రగతి న్యూస్ / తల్లాడ:
తల్లాడ మండలం మల్లవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఎర్రి నరసింహారావు గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామంలోని ప్రస్తుత పరిస్థితులు, అభివృద్ధి లోటుపాట్లు, ప్రజల అవసరాలను గుర్తుచేస్తూ ఆయన, నన్ను ఆశీర్వదించండి… ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. గ్రామాభివృద్ధికి నేను అంకితభావంతో కృషి చేస్తాను అని తెలిపారు.గ్రామ ప్రజలతో మాట్లాడుతూ ఆయన, ఈ మట్టి వాసన నాకు తెలిసింది… ఈ మనుషుల మనసు నాకు తెలుసు. గ్రామానికి నిజమైన మార్పు తీసుకువచ్చే సమయం ఆసన్నమైంది అని పేర్కొన్నారు. గతంలో డబ్బులు పంచే నాయకులను చూసిన గ్రామం, ఇప్పుడు నిబద్ధతతో పనిచేసే నాయకుడిని కోరుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా సిపిఎం–కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేస్తున్న యువ అభ్యర్థి కటికి కిరణ్ కుమార్ నీ గెలిపించాలని నరసింహారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ధి అధికారి ఉండాలి… తీర్పులో నిర్వేదం ఉండాలి. ఈ రెండూ కిరణ్ కుమార్లో ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఆయన విజయంతోనే గ్రామానికి కొత్త దిశ లభిస్తుంది అని ఆయన అన్నారు.అలాగే, మన ఓటు కేవలం ఓటు కాదు… మన నమ్మకం. ఆ నమ్మకాన్ని మీరు ఉంగరం గుర్తుపై చూపించాలి. నమ్మకాన్ని గెలిచిన నాయకుడే గ్రామ మార్పుకు దారితీయగలడు అని నరసింహారావు హితవు పలికారు.

