మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్
ఏన్కూర్ మండలం రేపల్లెవాడ గ్రామంలో సిపిఎం పార్టీ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం వేగం పుంజుకుంది. సర్పంచ్ అభ్యర్థి భూక్య లక్ష్మ గ్రామంలోని ప్రతి వాడలో ప్రజలను కలుసుకుంటూ సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.బ్యాట్ గుర్తుకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతూ రేపల్లెవాడలో నీటి సరఫరా, రోడ్లు, వీధి వెలుగులు, పేదల సంక్షేమం వంటి అంశాలను ప్రాధాన్యతగా పరిష్కరించే హామీ ఇచ్చారు. మహిళలు, యువత, వృద్ధుల నుండి ప్రచార యాత్రకు మంచి స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో మండల సిపిఎం నాయకులు, గ్రామస్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొని ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. దీంతో రేపల్లెవాడలో ఎన్నికల వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది.

