నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా
ఇటుకలపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థి మెరుగు సుమలత శ్రీనివాస్
మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
ఇటుకల పల్లి గ్రామానికి చెందిన మేరుగు సుమలత శ్రీనివాస్ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు.కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న సుమలత భర్త శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో గ్రామంలోని సమస్యలన్ని పరిష్కరిస్తానని, రోడ్లు డ్రైనేజ్ సమస్యలు గత పాలకులు పట్టించుకోలేదని, గ్రామంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, రోడ్లను పట్టించుకోన్న నాదుడే లేడని, ముఖ్యంగా డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. పోచమ్మ తల్లి ఆలయం శిథిలావస్థకు చేరుకుందని, దానిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఎండోమెంట్ కింద పది లక్షల మంజూరు కూడా ఇచ్చాడని నన్ను గెలిపిస్తే త్వరలో పనులు కూడా మొదలు పెడతామన్నారు. గ్రామంలోని పేదవారికి రేషన్ కార్డుల మంజూరు కి కృషి చేస్తానని,యువతకు మంచి లైబ్రరీ సదుపాయం ఏర్పాటు చేస్తానని, గ్రామంలో మురికి నీరు చెత్తాచెదారం లేకుండా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తానని, విద్యుత్ సమస్య లేకుండా చూస్తానని తెలిపారు. గ్రామస్తులంతా అభివృద్ధి కావాలనుకుంటే అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తే ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు.తాము ఈ ఎన్నికల బరిలో నిలిచింది పూర్తిగా గ్రామాభివృద్ధి కోసమేనని,సంక్షేమ పథకాలే తమకు ఆదరణ తీసుకువస్తాయని మెరుగు సుమలత శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.




