మన ప్రగతి న్యూస్ /నర్సంపేట
నర్సంపేట మండలంలో 17 వ తేదీన జరుగు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు, ప్రజలు తమ ఓటు హక్కు ను స్వేచ్చ గా , ధైర్యంగా వినియోగించుకొనేందుకు మీకు మేమున్నాం అను బరోసా కల్పిస్తూ మండలంలోని కమ్మపల్లి, దాసరిపల్లి, చంద్రయ్యపల్లి, బానోజీపేట, భోజనయక్తండ లో కవాతు నిర్వహించడం జరిగింది. ఇట్టి కవాతు లో నర్సంపేట మరియు దుగ్గొండి సీ ఐ లు రఘుపతి రెడ్డి, సాయి రమణ మరియు ఎస్ ఐ లు పాల్గొనడం జరిగింది.


