మన ప్రగతి న్యూస్ / కాప్రా ప్రతినిధి :
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటీవల జరిగిన వార్డుల పునర్విభజనలో ఏర్పడిన లోటుపాట్లను సర్దుబాటు చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సానుకూలంగా స్పందించి, వార్డుల పునర్విభజనలో ఉన్న లోటుపాట్లను త్వరలో సరిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, వివిధ డివిజన్లకు చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

