కాంగ్రెస్ బలపరిచిన వార్డు మెంబర్స్ను, సర్పంచ్ అభ్యర్థి బండారి చందర్రావు ను గెలిపించండి
శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి
మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
మండలంలోని గురజాల గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో కాంగ్రెస్ బలపరిచిన వార్డ్ మెంబర్స్,సర్పంచ్ అభ్యర్థి చందర్రావు కత్తెర గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి కోరారు. ఈ సందర్భంగా వార్డ్ మెంబర్స్ తో కలిసి శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతానని కాంగ్రెస్ వార్డు మెంబర్స్, సర్పంచ్ అభ్యర్థి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీ ఓటు ఎంతో విలువైంది. ఆ విలువ కాపాడుకోవాలంటే కత్తెర గుర్తుకు ఓటు వేయమని కోరారు. మీ సర్పంచి అభ్యర్థి బండారి చందర్ రావు ప్రజల మధ్య ఉంటూ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసే నాయకుడు మీ గ్రామంలో ఉండడం మీ అదృష్టమని,గత పాలకులు ఈ గ్రామాన్ని నిర్లక్ష్యం చేశారని, మీ సర్పంచ్ అభ్యర్థి కోరిన కోర్కెలను ఆయనను గెలిపిస్తే తప్పకుండా తీరుస్తానని మాట ఇచ్చారు. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి లో కూడా అంతే స్పీడ్ తో మీ సర్పంచ్ పని చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి బండారి చందర్రావు మాట్లాడుతూ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, గత పాలకులు ఎటువంటి అభివృద్ధి చేయలేదని,కత్తెర గుర్తుకు మీ ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఆదర్శ గ్రామంగా తయారు చేస్తానని అన్నారు. గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు.




