నిజాయితీగా ప్రజల సేవ చేస్తా
ఆదర్శవంతమైన పాలనను ప్రజలకు అందిస్తా
మీ సేవే నా లక్ష్యం
కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఇటుకలపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మేరుగు సుమలత శ్రీనివాస్
మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
నర్సంపేట మండలంలోని ఇటుకలపల్లి గ్రామానికి శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మేరుగు సుమలత శ్రీనివాస్ బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సుమలత భర్త శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ సమస్యలను నీతి నిజాయితీగా గ్రామసభ ఏర్పాటు ద్వారా పరిష్కరిస్తానని అన్నారు. గ్రామంలోని సిసి రోడ్లు, డ్రైనేజీలు,అందరికీ రక్షితమైన తాగునీరు అందిస్తానని వీధిలైట్లు ఏర్పాటుకు చొరవ తీసుకుంటానని, యువత కోసం క్రీడా లైబ్రరీ సదుపాయం ఏర్పాటు చేస్తానన్నారు. నీతి నిజాయితీగా పనిచేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేస్తానని నర్సంపేట మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ప్రజలు ఆదరించి బ్యాట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి సహాయంతో అభివృద్ధి చేస్తానని గ్రామంలో రేషన్ కార్డుల సమస్య, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా చూస్తాను అన్నారు. ప్రజలు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.



