మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్
రాయమాధారం గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థురాలిగా పోటీ చేస్తున్న ధరావత్ సోని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల సమర్థ అమలే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, 17వ తారీఖు మర్చిపోకుండా తనను ఆదరించి ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించండి అని గ్రామ ప్రజలను ఆమె కోరారు.

