మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గంలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగినవి. నియోజకవర్గ వ్యాప్తంగా అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ చాలా తక్కువ స్థానాలతో సరి పెట్టుకోవలసి వచ్చింది. అశ్వరావుపేట మండలంలో మొత్తం స్థానాలు 27. వీటిలో కాంగ్రెస్ 16 స్థానాలు దక్కించుకోగా, బిఆర్ఎస్ 7, సిపిఐ ఎంఎల్ 2, సిపిఎం 1, ఇతరులు 1. దమ్మపేట మండలంలో మొత్తం 31 స్థానాలు ఉండగా మిత్రపక్షాలతో కలుపుకొని కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలు, బి ఆర్ ఎస్ పార్టీ 7, ఇతరులు 2. గెలుచుకున్నారు. ములకలపల్లి మండలంలో మొత్తం స్థానాలు 19 ఉండగా వాటిలో కాంగ్రెస్ పార్టీ తన మద్దతుదారులతో 4 స్థానాలు దక్కించుకోగా, బి ఆర్ ఎస్ తన మద్దతుదారులతో 6 స్థానాలు, సిపిఎం 2, సిపిఐ ఎంఎల్ 4 స్థానాలను, ఇతరులు 3 సర్పంచ్ స్థానాలను గెలుపొందారు. చండ్రుగొండ మండలంలో మొత్తం 14 స్థానాలు ఉండగా వారి వారి మద్దతుదారులతో కాంగ్రెస్ పార్టీ 10 సర్పంచ్ స్థానాలను దక్కించుకోగా, బి ఆర్ ఎస్ పార్టీ 3, సిపిఐ పార్టీ 1. సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో మొత్తం సర్పంచులు స్థానాలు 10 ఉండగా కాంగ్రెస్ పార్టీ తన మద్దతుదారులతో 6 స్థానాలను గెలుచుకోగా, బి ఆర్ ఎస్ పార్టీ 2, ఇతరులు 2 స్థానాలను దక్కించుకున్నారు.

