Breaking News

బురద రాఘవపురం గ్రామం ప్రజలకు స్వతంత్ర అభ్యర్థి బాదావత్ నరేష్ విజ్ఞప్తి

కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలకు పిలుపు

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

ఏన్కూరు మండలం బురద రాఘవపురం గ్రామం ప్రజలకు మంగళవారం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాదావత్ నరేష్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను యువకుడిని, చదువుకున్న వ్యక్తినని, గ్రామ అభివృద్ధిపై పూర్తి అవగాహన కలిగి ఉన్నానని తెలిపారు.అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.గ్రామ ప్రజలు 17వ తారీఖును మర్చిపోకుండా కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని,అభివృద్ధి చేసి చూపిస్తానని బాదావత్ నరేష్ తెలిపారు.