మన ప్రగతి న్యూస్/ నడికూడ:
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. నడికూడ మండల కేంద్రంలోని రెండవ వార్డు ను అభివృద్ధి చేసి, వార్డు సభ్యులందరికీ అండదండగా ఉండి, అభివృద్ధే లక్ష్యంగా.. చేయూతనిస్తానని బిఆర్ఎస్ బలపరిచిన రెండో వార్డు అభ్యర్థి గోనెల రమేష్ అన్నారు. మూడో విడత భాగంగా ఈ నెల 17 బుధవారం రోజున జరగనున్న పంచాయితీ ఎన్నిక ల్లో రెండవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోనెల రమేష్..తన గౌను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రెండో వార్డ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. వార్డు ప్రజలు ఆశీర్వదించి, గౌను గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

