మన ప్రగతి న్యూస్/మానకొండూరు:
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1222 మంది నూతన సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఈ నెల 19 నుండి ఫిబ్రవరి 6 వరకు మూడు విడుతలుగా శిక్షణ తరగతులు జరగనున్నాయి.పి.ఆర్ చట్టం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వినియోగం,గ్రామ పంచాయతీల లో నిర్వహించాల్సిన బాధ్యతల పై వివరించనున్నారు.శిక్షణ తరగతులకు డిఎల్పిఓ లు టీచర్ ఆఫ్ ట్రేైనర్స్ గా వ్యవహరిస్తారు.

