మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిపై మంగళవారం మన ప్రగతి దినపత్రికలో పంచాయతీ కార్యదర్శి పై అవినీతి ఆరోపణ కథనానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ పూదారి రాజు,ఉప సర్పంచ్ దండు రాజేష్ అధ్యక్షతన శుక్రవారం ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో మొలంగూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో బహిరంగ విచారణ చేపట్టి జిల్లా ఉన్నత అధికారులకు నివేదిక సమర్పించునున్నట్లు ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఇంటి నిర్మాణ అనుమతులు,ఇంటిపేరు మార్పిడి అంశాలు మీసేవ కేంద్రాల్లో ఆన్లైన్లో మాత్రమే జరుగుతాయన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రభాకర్ పాల్గొన్నారు.

