Breaking News

సింగరేణి ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయం…

కొత్తగూడెం ఏరియా ఐ ఎన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజును జిఎం ఆఫీస్ నందు కలిసి కొత్తగూడెం ఏరియాలో ఖాళీగా ఉన్న సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ ఉద్యోగులకు త్వరగా ఇచ్చే విధంగా చూడాలని కోరడమైనది, అలాగే కొంత కాలంగా పెండింగ్లో ఉన్న పలు సమస్యలపై చర్చించడం జరిగింది. సింగరేణి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ఐఎన్టీయూసీ యూనియన్ పోరాటం చేస్తుందని, ఈ యొక్క సమస్యల్ని ఐఎన్టియుసి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ కు తెలియజేస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ సమస్యలపై స్పందించిన జనరల్ మేనేజర్ పై అధికారులతో మాట్లాడి త్వరగా ఇచ్చే విధంగా చూస్తానని తెలపడం జరిగింది.