మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
శంకరపట్నం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదంలో స్థానిక రైతు ప్రాణాలు కోల్పో యారు.తాడికల్ గ్రామానికి చెందిన రైతు రాణవేణి హనుమంతు అండర్ ఫ్లైఓవర్ కింద నుంచి వ్యవసాయ క్షేత్రానికి వెళుతుండగా కంటైనర్ మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.స్థానికుల సమాచారంతో సంఘటనకు చేరుకున్న పోలీసులు వివరాలను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

