మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ :
ఏన్కూర్ మండల కేంద్రంలో పండగల రద్దీతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను రోడ్లపైనే నిలుపుతుండటంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా ప్రధాన రహదారులపై ద్విచక్ర వాహనాలు, బస్సులు, లారీల పార్కింగ్ వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారులు స్పందించి వెంటనే ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

