మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్:
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు.రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సిట్ పేరుతో వరుసగా నోటీసులు జారీ చేస్తోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ చట్టాన్ని గౌరవించే నాయకుడని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఇప్పటికే చెప్పారని తెలిపారు.
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని నామ విమర్శించారు. కేసీఆర్ జోలికి వస్తే కాంగ్రెస్కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని, ఇలాంటి రాజకీయ చర్యలతో బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచలేరని నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

