Breaking News

ఆరే కటిక సంఘం నూతన అధ్యక్షునిగా- గణేష్ జీ

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

భూదాన్ పోచంపల్లి ఆరెకటిక సంఘం నూతన అధ్యక్షునిగా డబ్బికార్ గణేష్ జీ శనివారం జరిగిన సంఘ సమావేశంలో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మండల పరి ధిలోని ఇంద్రియాల గ్రామ శివారులో గల సంకెళ్ల మైసమ్మ దేవాలయం వద్ద జరిగి న సమావేశంలో సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుని గా గణేష్ తో పాటు గౌరవ అధ్యక్షులుగా డబ్బికార్ హరికిషన్, ప్రేమ్ కుమార్, గౌర వ సలహాదారునిగా డబ్బికార్ సాహెష్, ఉపాధ్యక్షునిగా డబ్బికార్ జగన్, ప్రధాన కార్యదర్శిగా డబ్బికార్ కాశీనాథ్, కోశాధికారిగా డబ్బికార్ లింగోజి ,సహాయ కార్య దర్శిగా సంతోష్ తో పాటు మరో 12 మందిని కార్యవర్గ సభ్యులుగా నియమితుల య్యారు. ఈ మేరకు నూతన కార్యవర్గం చే మాజీ అధ్యక్షుడు హరికిషన్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా అధ్యక్షునిగా ఎన్నికైన గణేష్ కు, ఈ సంద ర్భంగా పూలమాలవేసి, శాలువాతో సత్కరించారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి