మన ప్రగతి న్యూస్/నిజమాబాద్:
ఇటీవల విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం తరఫున 1 కోటి రూపాయల చెక్కును ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి వారి తల్లి, ఇతర కుటుంబ సభ్యులకు అందజేశారు. ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహి రంగ సభ వేదికగా ముఖ్య మంత్రి వారి కుటుంబ సభ్యులకు ఆ చెక్కును అందించారు.

