Breaking News

వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్మన ప్రగతి న్యూస్ / వర్ధన్నపేట : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట ఏసిపి అంబటి నరసయ్య ఆధ్వర్యంలో శనివారం రోజున వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో పోలీసులు ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ ఉమ్మడి నరసయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు. పట్టణ ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలుగ చెయ్యకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించే లాగా సహకరించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎస్ఐలు సాయిబాబా, రాజు, జఫర్గడ్ ఎస్సై రామారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

దేశవ్యాప్త సమ్మెకు ఎంపీడీవో కు జిపి సిబ్బంది వినతి

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

శంకరపట్నం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ కు సిఐటియు నాయకులు వినతి పత్రం అందించారు.వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని,విద్యుత్ సవరణ చట్టం, విత్తన సవరణ బిల్లు వంటి నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని, అంగన్వాడి, మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.జిల్లా అధ్యక్షులు రాచర్ల మల్లేశం,గ్రామపంచాయతీ మండల యూనియన్ అధ్యక్షులు ఎలుకపల్లి సారయ్య,సిఐటియు మండల కన్వీనర్ ఇమ్మడి చక్రపాణి,కార్యదర్శి కోహెడ సమ్మయయ్య,ఉపాధ్యక్షులు అలువాల జనార్ధన్,కిష్టయ్య,మేకల రమేష్, పోచయ్య పాల్గొన్నారు

సోలార్ రంగంలో ‘శ్రీ బాలాజీ సోలార్ ఎనర్జీస్’ విజయకేతనం