నగరపాలక సంస్థ 2వ సాధారణ ఎన్నికలకు అంతా సిద్ధం
మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్:
కరీంనగర్ జిల్లాలో 66 డివిజన్లలో మొత్తం 3,40,580 ఓటర్లు,మహిళా ఓటర్లు 1,70,858 మంది ఉన్నారు.పురుష ఓటర్లు 1,69,679 మంది ఇతరులు 43 మంది ఉన్నారు.మొత్తం 477 పోలింగ్ స్టేషన్లు, సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 14, మాడల్ పోలింగ్ స్టేషన్లు 5 ఏర్పాటు చేసారు. నగరపాలక సంస్థ ఎన్నికల బరిలో వివిధ పార్టీలకు చెందిన మొత్తం 389 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.పోలింగ్ 11 వ తేదీన ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటలకు పోలింగ్ జరుగుతుంది.13 వ తేదీన ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.66 డివిజన్ల బ్యాలెట్ బాక్సుల బధ్రపరిచేందుకు 2 స్ట్రాంగ్ రూంల ఏర్పాటు.పోలింగ్ కౌంటింగ్టింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామని,ఓటర్ల కు ఇబ్బంది కలగకుండా త్రాగునీరు సౌకర్యాలు ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి పమేల సత్పతి తెలిపారు.

