మన ప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా వివిధ మండలాలలో స్కూలు పిల్లలను చేరవేసే ఆటోలు స్కూల్ బస్సులు తనిఖీ చేసిన జిల్లా రవాణా శాఖ మోటారు వాహనంలను తనిఖీ చేసిన అధికారులు వేములవాడ, కొనరావుపేట,చందుర్తి, రుద్రంగి, తంగళ్లపల్లి,ఎల్లారెడ్డిపేట, మండలాలలో ముమ్మర తనిఖీలు చేపట్టారు జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ ఆదేశాల మేరకు జిల్లాలో 15 వాహనములను సీజ్ చేసినట్టు తెలిపారు. సహాయక మోటారు వాహన తనిఖీ అధికారి పాఠశాల విద్యార్థులను చేరవేసే డ్రైవర్లకు తగు సూచనలు సలహాలు ఇచ్చినారు.ఇందులో ముఖ్యంగా పాఠశాలల పిల్లలను చేరవేసే వాహనములు అధికంగా ఉన్నట్టు తెలిపారు స్కూల్ పిల్లల ను చేరావేసే వాహన యజమానులకు డ్రైవర్లకు వాహన పరిమితికి మించి విద్యార్థులను తీసుకుని వెళ్ళద్దని,వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు టాక్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరిగా వాహనం వెంట ఉండాలని డ్రైవర్ యూనిఫార్మ్ తప్పని సరిగా ధరించాలని తెలిపారు.సరుకు రవాణా వాహనాలు అధికాలోడు వేస్తె కఠిన చెర్యలు ఉంటాయని డ్రైవర్ లైసెన్స్ లేకుంటే సస్పెండ్ చేస్తామని తెలిపారు.ఇట్టి తనిఖీల్లో మోటారు వాహనముల తనిఖీ అధికారి వంశీధర్, సహాయక మోటారు వాహనముల తనిఖీ అధికారి పృద్విరాజ్ వర్మ, రజని, కానిస్టేబుల్ రమ్య, సౌమ్య, ప్రశాంత్, మల్లేష్ పాలుగోన్నారు.

