Breaking News

మిర్యాలగూడలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

మన ప్రగతి న్యూస్/మిర్యాలగూడ

మిర్యాలగూడ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బి ఎల్ అర్) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సంప్రదాయ పద్ధతిలో గుమ్మడికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం భక్తుల మధ్య భారీగా రథయాత్ర కొనసాగింది.
ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నిర్వాహకులు కీలక పాత్ర పోషించారు.

చిరుత సంచరిస్తుంది కావున జాగ్రత్తగా ఉండండి: