Breaking News

పార్టీల జండాలతో అంబేద్కర్ ను అవమానిస్తారా

సకాలంలో స్పందించి వెంటనే తొలగించాలని మేయర్ కు వినతి…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత ఆత్మహత్య

ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణం పోస్ట్ ఆఫీస్ సెంటర్ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ రాజకీయ పార్టీ జెండాలను ఏర్పాటు చేయడాన్ని దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఏర్పాటు చేసిన జెండాలను వెంటనే తొలగించాలని కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్ కు దళిత సంఘాల నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.గత అనేక కాలంగా ఈ విధానం కొనసాగుతున్నదని అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించి సమస్త వ్యవస్థలకి తను రాసిన రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పిస్తున్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఏ రాజకీయ పార్టీ జెండాలు ఏర్పాటు చేయరాదని, అలా ఏర్పాటు చేస్తే ఆయనను అవమానించడమేనని, ఇప్పుడు ఏర్పాటు చేసిన వాటిని వెంటనే తొలగించాలని, రాబోవు కాలంలో కూడా ఏర్పాటు చేయకుండా కార్పొరేషన్ వారు ప్రత్యేక నిబంధనలు విధించాలని, వాటిని ఉల్లంఘిస్తే అధిక మొత్తంలో జరిమానా విధించే విధంగా చర్యలు చేపట్టాలని, అంబేద్కర్ విగ్రహం చుట్టూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన మేయర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే నేను మేయర్ అయ్యానని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, చర్మకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు చదలవాడ సూరి, మహిళా సమైక్య నాయకురాలు కరీష రత్నకుమారి, మాదిగ ఐక్యవేదిక నాయకులు వేల్పుల భాస్కర్, టిఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు గుండా రమేష్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు మోదుగు జోగారావు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కనకం సూరిబాబు, కార్పొరేటర్ సాగర్, దళిత సంగం జిల్లా నాయకులు చెనగా లక్ష్మణ్, మాదిగ యువజన నాయకులు మొగిలి పాక మురళి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.